Rajnikanth : చంద్రబాబు ఉదంతం ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఉదంతంలో వైసీపీ నేతలకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పలువురు ప్రముఖులు కూడా వైసీపీ నేతల తీరుని ఎండగడుతున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్ చంద్రబాబుకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు.
ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్, నాగబాబు వంటి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి, అంబటి రాంబాబు.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూతురు, తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై పరుష పదజాలంతో దూషించారంటూ.. వార్తలు వచ్చాయి. ఈ ఘటన రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది.
భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరిపై మండిపడుతున్నారు. ఒకప్పుడు టీడీపీతోనే రాజకీయ ప్రస్థానాన్ని వీరు మొదలు పెట్టారు. వీళ్లిద్దరూ జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత ఆప్తులు. అలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెబుతూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.