Radhe Shyam : బాహుబలి తర్వాత భారీ అంచనాలతో విడుదలైన సాహో చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచడంతో ప్రభాస్ తదుపరి చిత్రం రాధే శ్యామ్పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలవుతోంది. ప్రభాస్ పుట్టిన రోజైన అక్టోబర్ 23వ తేదీన ఈ సినిమా టీజర్ను విడుదల చేయగా, ఇది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
చిత్రం ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా, ఈ సినిమాకి ఛాయాగ్రహకుడిగా వ్యవహరించిన మనోజ్ పరమహంస తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లైమాక్స్ గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. క్లైమాక్స్ లో 15 నిమిషాల పాటు మునుపెన్నడూ చూడని యాక్షన్ సన్నివేశాలతో ఉత్కంఠభరితంగా ఉంటుందని పరమహంస చెప్పారు. క్లైమాక్స్ను దాదాపు రూ.50-80 కోట్ల ఖర్చుతో విలాసవంతమైన రీతిలో చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.
క్లైమాక్స్ కోసం ఒక సంవత్సరానికి పైగా పనిచేశానని, ఇది 1970ల నాటి ఇటాలియన్ బ్యాక్డ్రాప్లో రూపొందిందని పేర్కొన్నారు. పరమహంస వ్యాఖ్యల తర్వాత రాధేశ్యామ్ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…