Pushpa Movie : సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ మూవీ రెండు పార్ట్లుగా వస్తోంది. ఈ క్రమంలోనే తొలి పార్ట్ను డిసెంబర్ 1న పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ను వేగవంతం చేసింది. కాగా పుష్ప మూవీ ట్రైలర్ను డిసెంబర్ 6న విడుదల చేయనుండగా.. ఈ ట్రైలర్కు చెందిన చిన్న టీజర్ శాంపిల్ను తాజాగా విడుదల చేశారు. ఇందులో అనసూయ అరాచకం సృష్టించింది.
పుష్ప ట్రైలర్కు చెందిన టీజర్లో రష్మికకు చెందిన కొన్ని సీన్లు కనిపించగా.. ఈ మూవీలో దాక్షాయణిగా కనిపించనున్న అనసూయ రచ్చ చేసింది. మంగళం శీను పాత్రలో నటిస్తున్న సునీల్ మీదకు అనసూయ ఎక్కి రచ్చ చేసింది. అనసూయ తన నోట్లో బ్లేడు పెట్టుకుని కనిపించింది. దీంతో ఆమె ఈ మూవీలో సునీల్కు భార్యగా చేస్తుందా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే అనసూయ ఈ మూవీలో చేసిన రచ్చ టీజర్లోనే ఇలా ఉంటే.. రేపు సినిమాలో ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు అనసూయను ట్రోల్ చేస్తున్నారు. మంగళం శీను పాత్రలో సునీల్ నటిస్తున్నాడు కనుక అతనికి భార్యగా అనసూయ నటించి ఉంటుందని, అందుకనే ఆమె అలా ఆ సీన్లో చేసి ఉంటుందని అనుకుంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.