Pooja Hegde : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరిగా ఉన్న పూజా హెగ్డె దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటోంది. టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్నా కూడా ఐటమ్ సాంగ్లకి సై అంటోంది. ఇప్పటికే రంగస్థలం చిత్రంలో మాస్ డ్యాన్స్ చేసి ఓ ఊపు ఊపిన పూజా హెగ్డె ఇప్పుడు ఎఫ్ 3 లో స్పెషల్ నంబర్ చేయనుందట. ఇందుకోసం భారీగా డిమాండ్ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం పూజాను సంప్రదించగా.. తాను రూ.1.50 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఫైనల్గా మేకర్స్ తనను రూ.1 కోటికి ఒప్పించినట్టు టాక్. ఇప్పటికే రంగస్థలంలో జిగేలు రాణిగా మెప్పించింది పూజా హెగ్డె.

పూజా.. ప్రభాస్తో కలిసి నటించిన రాధే శ్యామ్ సినిమా ఇటీవల విడుదలయ్యి తన యాక్టింగ్కు మంచి మార్కులు పడేలా చేసింది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన బీస్ట్ తో పూజా కోలీవుడ్లోకి గ్రాండ్గా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక బీస్ట్ సినిమాలో పూజా గ్లామర్కు, డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తెలుగులో ఒక్క సినిమా చేసేందుకు పూజ రూ.2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. అయితే బీస్ట్ సినిమా కోసం మాత్రం పూజా భారీగానే వసూలు చేసింది. బీస్ట్ కోసం పూజకు రూ.3.50 కోట్లు దక్కాయి. ఇక విజయ్ కూడా ఈ సినిమా కోసం ఏకంగా రూ.70కోట్లు తీసుకున్నాడని సమాచారం.
పూజా హెగ్డె ఒక్క ప్రకటన చేసేందుకు పూజ రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షలు ఛార్జ్ చేస్తోంది. తన అందం, నటనతోపాటు.. స్టైలిష్ లుక్తో పూజా ఎప్పుడు హాట్ టాపిక్గా ఉంటుంది. అయితే ఈ అమ్మడి రెమ్యునరేషన్ గురించి వింటుంటేనే నిర్మాతల గుండెల్లో గుబులు పుడుతోంది.ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ టాప్ ప్లేస్కు దూసుకుపోతోంది పూజా హెగ్డె. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా చిత్రాల్లోనూ ఈమె చోటు దక్కించుకుంటోంది.