Aadi Saikumar : ఆది సాయికుమార్, పాయల్ రాజ్పూత్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. కల్యాణ్ జి గోగణ తెరకెక్కిస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మాత. చాలా కాలంగా ఒక్క హిట్టు కోసం చూస్తున్న ఆది ఇప్పుడు మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. కళ్యాణ్ గోగణ దర్శకత్వంలో తీస్ మార్ ఖాన్ అనే సినిమా చేస్తున్న ఆది ఇప్పుడు పాయల్ రాజ్ పూత్ తో బీచ్ లో రొమాన్స్ లో మునిగితేలుతున్నాడు.
చిత్ర ఫస్ట్లుక్ను విడుదల చేయగా, ఈ పోస్టర్లో ఆది, పాయల్ సముద్ర తీరంలో కూర్చొని.. ఒకరినొకరు చూసుకుంటూ రొమాంటిక్గా కనిపించారు. ‘‘యాక్షన్ ప్రాధాన్యమున్న కథతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. నాయకానాయికలపై ఓ రొమాంటిక్ గీతం తెరకెక్కిస్తున్న నేపథ్యంలో పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో పాయల్, ఆది చాలా కొత్తగా కనిపిస్తారు’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు ఆది సాయి కుమార్. ఇప్పుడు కూడా ఈయన మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి తీస్ మార్ ఖాన్. విజన్ సినిమాస్ బ్యానర్పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరోవైపు పాయల్ కూడా మంచి హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తోంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…