Pattabhi : తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి ఇటీవలి కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలిచారు. ఏపీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. ఆయనను అరెస్టు చేశారు. దీంతో ఆయన జైలులో ఉండి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన ఎవరికీ కనిపించలేదు. సడెన్ గా విమానంలో ఆయన ఎక్కడికో ప్రయాణం అవుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఆయనపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
టీడీపీ నేత పట్టాభి విమానంలో మాల్దీవులకు వెళ్లారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో నిజమెంత ? అన్న విషయం తెలియదు కానీ ఆయన విమానంలో ఉన్న ఫొటోలను వైరల్ చేస్తున్నారు. వైసీపీ అభిమానులు దీనిపై ఘాటుగా స్పందిస్తున్నారు. పట్టాభి దేశం విడిచిపెట్టి పారిపోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే టీడీపీ వారు మాత్రం అవి పాత ఫొటోలు అయి ఉండవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా పట్టాభి ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని రోజులు ఈ గొడవలకు దూరంగా ప్రశాంతంగా గడిపేందుకు ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది.