Nagarjuna : సాధారణంగా ఏ రంగంలోనైనా పనిచేసి బాగా డబ్బులు సంపాదిస్తున్న తర్వాత ఎవరైనా కూడా ఆస్తులను పోగు చేసుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో పనిచేసే ఎంతో మంది సెలబ్రెటీలు వారు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న తరువాత ఆస్తులను కొనుగోలు చేయడం మనం చూస్తుంటాము. ఈ క్రమంలోనే గతంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఉన్న నాగార్జున సైతం ఒక భూమిని కొనుగోలు చేసే విషయంలో దారుణంగా మోసపోయారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నాగార్జున గచ్ఛిబౌలి ప్రాంతంలోని ఒక భూమిని కొనుగోలు చేసి దారుణంగా మోసపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ భూమిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర కొన్నారని.. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వయానా తన సమీప బంధువని తెలుస్తోంది. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన బంధువు కావడంతో అతనిపై ఉన్న నమ్మకం వల్ల భూమిని కొనుగోలు చేసిన నాగార్జున ఏకంగా అతడు చేసిన మోసానికి కోట్ల రూపాయలు నష్టాన్ని ఎదుర్కొన్నారట.
అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని కుటుంబానికి వేల కోట్లలో ఆస్తిపాస్తులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇలా అన్ని విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండే అక్కినేని కుటుంబం ఇలా సమీప బంధువుల చేతిలో మోసపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.