రూ.10వేల కోసం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు.. ఈయన గురించి తెలిస్తే కన్నీళ్లు వస్తాయి..

కరోనా వల్ల ఎంతో మంది బతుకులు ఛిద్రమయ్యాయి. ఎంతో మంది ఎన్నో రకాలుగా నష్టపోయారు. చాలా మంది తమ ఆత్మీయులను కోల్పోయారు. కొందరు ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను చిన్నా భిన్నం చేసింది. అయితే చాలా మంది ఆర్థికంగా చితికిపోయారు కూడా. అలాంటి వారిలో ఈయన కూడా ఒకరు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

జార్ఖండ్‌లోని హజారిబాగ్‌కు చెందిన మిథిలేష్‌ కుమార్‌ మెహతా 2018లో ఓ కొత్త ట్రాక్టర్‌ కొన్నాడు. అందుకు గాను మహీంద్రా ఫైనాన్స్‌ నుంచి లోన్‌ తీసుకున్నాడు. అంతకు ముందే అతనికి ఉన్న పాత ట్రాక్టర్‌ను ఇచ్చి దానికి వచ్చే మొత్తం పోగా.. ఇంకాస్త మొత్తాన్ని ముందుగా డౌన్‌ పేమెంట్‌ రూపంలో చెల్లించాడు. దీంతో కొత్త ట్రాక్టర్‌ వచ్చింది. మిగిలిన రుణం మొత్తాన్ని 44 వాయిదాల్లో నెలకు రూ.14,300 చొప్పున చెల్లించాల్సి ఉంది. అయితే కరోనా లాక్‌ డౌన్‌ వరకు అంతా సజావుగానే సాగింది. కానీ లాక్‌ డౌన్‌ వల్ల మిథిలేష్‌ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన సమస్యలు చుట్టుముట్టాయి.

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా పనులు జరగక ఆదాయం రాలేదు. అయినప్పటికీ మిథిలేష్‌ ఎలాగో వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు. తనకు తెలిసిన వారి వద్ద డబ్బును అప్పుగా తీసుకుని రుణాన్ని చెల్లించాడు. అయితే చివరకు 6 వాయిదాలు మిగిలాయి. కానీ అతని వద్ద చెల్లించేందుకు చిల్లి గవ్వ లేదు. దీంతో జరిమానా విధించారు. అయినప్పటికీ రూ.33వేల ఫైన్‌తో మొత్తం రూ.1.22 లక్షలను ఈ ఏడాది సెప్టెంబర్‌ 22 వరకు చెల్లించాలని గడువు పెట్టడంతో.. ఆ మొత్తాన్ని అతను తీర్చేశాడు.

అయితే సెప్టెంబర్‌ 15వ తేదీన ఉన్నట్లుండి ఆ ఫైనాన్స్‌ కంపెనీకి చెందిన రికవరీ ఏజెంట్లు మిథిలేష్‌ ఇంటికి వచ్చారు. రుణం ఇంకా రూ.10వేలు ఉందని అది చెల్లించాలని లేదంటే ట్రాక్టర్‌ను తీసుకెళ్తామని చెప్పారు. అయితే మిథిలేష్‌ కుమార్తె మోనిక (22) అక్కడే ఉండి లోన్‌ మొత్తం చెల్లించామని.. ఒక్క రూపాయి కూడా పెండింగ్‌ లేదని చెప్పింది. కానీ ఆ ఏజెంట్లు కొన్ని పేపర్లు చూపించి ఇంకా రూ.10వేలు రావల్సి ఉందని అన్నారు. అయితే తమ వద్ద డబ్బు లేదని చెప్పగా.. ఆ ఏజెంట్లు ఆ ట్రాక్టర్‌ను తీసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో మిథిలేష్‌, మోనిక ఇద్దరూ ట్రాక్టర్‌కు అడ్డు పడ్డారు. అయితే కనికరం లేని ఏజెంట్లు మోనిక మీదుగా ట్రాక్టర్‌ను రెండు సార్లు పోనిచ్చారు. గర్భంతో ఉన్న ఆమెకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ క్రమంలోనే సదరు ఏజెంట్లపై కేసు నమోదు చేశారు.

అయితే కేవలం రూ.10వేల కోసం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నారని మిథిలేష్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే అతను పడుతున్న బాధ వర్ణనాతీతం. అయితే మరోవైపు మహీంద్రా ఫైనాన్స్‌ సంస్థ స్పందించి మిథిలేష్‌కు సారీ చెప్పింది. అయినప్పటికీ రికవరీ ఏజెంట్లు చేసింది మాత్రం క్షమించరాని నేరం అని అందరూ అంటున్నారు.

Share
Editor

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM