Manchu Manoj : మా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అటు ప్రకాష్ రాజ్ ప్యానెల్, ఇటు మంచు విష్ణు ప్యానెల్ల మధ్య మాటల పోరు జరుగుతున్న నేపథ్యంలో.. మంచు ఫ్యామిలీకి చెందిన హీరో పవన్ కల్యాణ్ను కలవడం ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే ఆయనను గురువారం మంచు మనోజ్ కలిశారు.
షూటింగ్ లొకేషన్లో పవన్ ను కలిసిన మనోజ్ కాసేపు ఆయనతో మాట్లాడారు. తరువాత మనోజ్ ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను కలిసినందుకు సంతోషంగా ఉంది, ఆయన దయ, ప్రేమ చూపిస్తారు.. లవ్ యూ మచ్, జై హింద్.. అంటూ మనోజ్ ట్వీట్ చేశారు.
It's always a pleasant yet powerful experience meeting our power star @PawanKalyan garu ??
Spoke heartfully. Thanks for the kind words & love u showered upon me anna?
Love you much 🙂 Jai Hind ??? pic.twitter.com/YoRwxYPWiu— Manoj Manchu??❤️ (@HeroManoj1) October 14, 2021
అయితే గురువారం మధ్యాహ్నం మోహన్ బాబు, మంచు విష్ణులు బాలకృష్ణను ఆయన నివాసంలో కలిశారు. మా ఎన్నికల్లో తన కుమారుడు విష్ణుకు మద్దతు తెలిపినందుకు గాను బాలకృష్ణకు మోహన్ బాబు ధన్యవాదాలు తెలిపారు.
కాగా ఒకే రోజు ఇలా మంచు ఫ్యామిలీ సభ్యులు ఇద్దరు వేర్వేరు అగ్ర హీరోలను కలవడం, అందులోనూ మా ఎన్నికల వివాదాలు జరుగుతున్నప్పుడు ఇలా వారు ఆ హీరోలను కలవడం.. ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపేందుకు వారు ఆయనను కలిశారని చెప్పారు. మరి మనోజ్ పవన్ను ఎందుకు కలిశాడన్నది ఇప్పటికీ సస్పెన్స్గానే మారింది. ఇక మనోజ్ అహం బ్రహ్మాస్మి అనే మూవీతో మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.