అతను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎప్పుడు ఎలా ఉండాలో, పరిస్థితులను ఎలా అధిగమించాలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వ్యక్తి. ఇలా పిల్లలకి ఎన్నో మంచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు క్షణికావేశంలో కొన్ని సమస్యల కారణంగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన భర్త మరణించాడని తెలుసుకున్న భార్య రెండంతస్తుల పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నర్సాపూర్ పట్టణం శ్రీ రామ్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న రామారావు అనే వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే కొన్ని కుటుంబ సమస్యల కారణంగా అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య అమ్ములు రెండవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటంతో స్థానికులు గమనించి వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా ఆమెకు కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు.
ఈ క్రమంలోనే మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ కు తరలించారు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే తమ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక ఈ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ చూస్తున్న చూపులు స్థానికులను కలచివేశాయి. కాగా తమ ఉపాధ్యాయుడు మరణించాడు అన్న విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…