Mahesh Rajamouli : రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఈ కాంబినేషన్తో సినిమా నిర్మించడానికి నిర్మాత కె.ఎల్. నారాయణ ప్లాన్ చేశారు. ఇన్నాళ్లకు కానీ అది వాస్తవరూపం దాల్చడం లేదు. ఈ చిత్రం పలు కారణాలు.. వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తికాగానే రాజమౌళితో మూవీ స్టార్ట్ చేస్తాడు మహేష్. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకకాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్తో షూట్ చేయనున్నారట.
దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళికి హాలీవుడ్లో మంచి పాపులారటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో కూడా షూటింగ్ చేస్తారట. ఇక ఇది అలా ఉంటే ఈ సినిమాపై మరో ఇంట్రెస్టెంట్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ డ్రామా నిజ జీవిత సంఘటన ఆధారంగా వస్తోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్వయంగా ఓ బాలీవుడ్ మీడియాతో తెలిపినట్లు టాక్.

మరోవైపు ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ లాస్ ఏంజెల్స్కకు సంబంధించిన ప్రముఖ ఏజెన్సీ CAA (క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ)తో ఒప్పందం కుదుర్చున్నారట. ఈ సంస్థ కాస్టింగ్తో పాటు, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి సేవలను అందిస్తుంది. ఇలాంటి సంస్థతో రాజమౌళి డీల్ అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి తన సమయాన్ని మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసమే కేటాయించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ విషయమై తన తండ్రి విజయేంద్ర ప్రసాద్తో డిస్కషన్స్ పూర్తి చేసి ఒక రూపు తీసుకొచ్చినట్టు సమాచారం.