బ్రిటిషర్లు మన దేశంలో మొదటిసారి అడుగు పెట్టిన తరువాత చాలా ఏళ్ల పాటు కోల్కతాను రాజధానిగా చేసుకుని పాలించారు. తరువాత రాజధానిని ఢిల్లీకి మార్చారు. అయితే అక్కడ వారు ఉపయోగించిన ఓ భవనాన్ని ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ భవనంగా వాడుతున్నారు. ఆ భవనంలో తాజాగా ఓ సొరంగ మార్గం బయట పడింది. దాని నుంచి దారి ఢిల్లీలోని ఎర్ర కోట వరకు ఉండడం విశేషం.
ఢిల్లీ అసెంబ్లీ భవనంలో తాజాగా ఓ సొరంగ మార్గాన్ని గుర్తించారు. దీనిపై స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ మాట్లాడుతూ.. 1993లోనే తనకు ఈ విషయం తెలుసని అన్నారు. అయితే అప్పట్లో దీని గురించి చదివానని, కానీ ఆధారాలు లభించలేదని అన్నారు. కానీ తాజాగా ఇప్పుడే సొరంగాన్ని కనుగొన్నామని తెలిపారు. సొరంగ మార్గం మొత్తాన్ని గుర్తించామని, అది అసెంబ్లీ నుంచి ఢిల్లీలోని ఎర్ర కోట వరకు ఉందని తెలిపారు.
అయితే సొరంగంలో ప్రస్తుతం కొంత వరకు భాగం మాత్రమే ఖాళీగా ఉందని, మిగిలిన భాగంలో మట్టి, భవన నిర్మాణ వ్యర్థాలు నిండిపోయాయని, అందువల్ల సొరంగంలో ఇప్పుడు వెళ్లలేమని తెలిపారు. కానీ దాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టామని అవి 2022 ఆగస్టు 15 వరకు పూర్తవుతాయని అన్నారు. దీంతో ఆ సొరంగంలో పర్యాటకులు ప్రయాణించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
అయితే 1912వ సంవత్సరంలో బ్రిటిష్ వారు తమ రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చగా అప్పటి నుంచి ఈ భవనంలోనే వారు ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించడం మొదలు పెట్టారు. ఈ భవనాన్ని అప్పట్లో వారు కోర్టుగా ఉపయోగించారు. వారు ఎర్ర కోట నుంచి పలువురు స్వాతంత్య్ర సమర యోధులను సొరంగ మార్గం ద్వారా ఈ కోర్టుకు తెచ్చి వారికి శిక్షలు విధించేవారు. తరువాత ఈ మార్గం ద్వారానే వాళ్లను బయటకు తరలించేవారు.
కానీ కాలక్రమేణా దాని గురించిన వివరాలు చరిత్రలో మరుగున పడిపోవడంతోపాటు సొరంగ మార్గం చాలా వరకు పూడుకుపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆ సొరంగాన్ని మళ్లీ గుర్తించారు. దీంతో దాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టారు.
అయితే సదరు సొరంగం మార్గం ఎంత పొడవు ఉంటుందో తెలియదు కానీ దాన్ని పూర్తిగా పునరుద్ధరించాక అన్ని వివరాలు తెలుస్తాయి. ఇక ఆ సొరంగాన్ని అందుబాటులోకి తెస్తే స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాల గురించి మనకు కళ్లకు కట్టినట్లు తెలుస్తుందని స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ఈ సొరంగ మార్గం గురించి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…