ఆవు పేడను ఒంటికి రాసుకుంటే కోవిడ్ తగ్గుతుందా ? అంటే.. అక్కడి వాసులు అవుననే అంటున్నారు. అందుకనే వారు రోజూ గంటల తరబడి ఆవు పేడ, మూత్రం కలిపిన మిశ్రమాన్ని ఒంటికి పట్టించుకుంటున్నారు. తరువాత ఆవు పాలు లేదా మజ్జిగతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంత వాసులకు ఇది నిత్య కృత్యంగా మారింది.
గుజరాత్లోని అహ్మదాబాద్ నగర శివార్లలో శ్రీ స్వామి నారాయణ గురుకుల విశ్వ విద్య ప్రతిస్థానం గోశాలలో రోజూ చాలా మంది శరీరాలకు ఆవుపేడను పట్టించుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల కోవిడ్ నయం అవుతుందని అంటున్నారు. గతంలో ఓ ఫార్మా కంపెనీకి చెందిన గౌతమ్ మనీలాల్ బోరిసా అనే వ్యక్తి ఇలాగే చేశాడట. దీంతో అతను కోవిడ్ నుంచి త్వరగా కోలుకున్నాడట. ఈ మాట అతను అందరికీ చెప్పాడు. దీంతో అందరూ అలాగే చేయడం మొదలు పెట్టారు. ఇలా అక్కడికి రోజూ వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
అయితే వైద్య నిపుణులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. ఆవు పేడతో కోవిడ్ తగ్గదని, పైగా ఆవు పేడను శరీరానికి రాసుకుంటే బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని, కనుక ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని సూచిస్తున్నారు. అయినప్పటికీ అక్కడి వారు మాత్రం తమ పనిని కొనసాగిస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…