Dhaba Style Fish Curry : చేపలను మనం రకరకాలుగా వండుకుని తినవచ్చు. కొందరు వేపుడు అంటే ఇష్టపడతారు. కొందరు పులుసు పెట్టుకుని తింటారు. కొందరు గ్రిల్ చేసుకుని తింటారు. అయితే బయట ధాబాలలో చేసే చేపల పులుసు ఎంతో రుచికరంగా అనిపిస్తుంది. దాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ధాబా స్టైల్ చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేపలు – 500 గ్రాములు, మారినేషన్ కోసం – శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, కాశ్మీరీ ఎండుమిరపకాయల పొడి – ఒక టీస్పూన్, పసుపు – ఒక టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, ఉప్పు – ఒక టీస్పూన్, నిమ్మరసం – రెండు టీస్పూన్లు, నూనె – రెండు టేబుల్ స్పూన్లు, నీళ్లు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు – 100 గ్రాములు, అల్లం (తరిగింది) – చిన్న ముక్క, తరిగిన టమాటాలు – 200 గ్రాములు, కారం – ఒకటీస్పూన్, ఆవాలు – అరటీస్పూన్, పచ్చి మిరపకాయలు (తరిగినవి) – 2
ధాబా స్టైల్ చేపల పులుసు తయారు చేసే విధానం..
పైన తెలిపిన అన్ని పదార్థాలను కలిపి మసాలా మిశ్రమం తయారు చేయాలి. అందులో చేప ముక్కలను వేసి బాగా కలపాలి. ముక్కలకు మసాలా బాగా పట్టేలా కలపాలి. అనంతరం చేప ముక్కలను మారినేషన్ చేయాలి. అందుకు గాను మసాలా కలిపిన ముక్కలను 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. తరువాత ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీలో బ్లెండ్ చేయాలి. దాన్ని స్మూత్ పేస్ట్లా తయారు చేసుకోవాలి.
ఒక పాన్ తీసుకుని నూనె వేసి వేడి చేయాలి. ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఆ నూనెలో వేసి బాగా ఫ్రై చేయాలి. తరువాత వాటిని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు వేయాలి. తరువాత పచ్చి మిరపకాయలను వేయాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా పేస్ట్ను వేయాలి. బాగా కలపాలి. 20 నిమిషాల పాటు మీడియం హీట్పై ఫ్రై చేయాలి. తరువాత మసాలా పొడులు, ఉప్పు కలపాలి. మళ్లీ ఫ్రై చేయాలి. 5-6 నిమిషాల పాటు మీడియం నుంచి తక్కువ హీట్పై ఫ్రై చేయాలి. అనంతరం 400 ఎంఎల్ నీరు కలపాలి. తరువాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టిన చేప ముక్కలను వేయాలి. మూత పెట్టి ఉడికించాలి. 10 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. తరువాత మూత తీసి దానిపై కసూరి మేథీ పొడి వేయాలి. అనంతరం కూరను కలిపి మరో 2-3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించాలి. దీంతో వేడి వేడి ధాబా స్టైల్ చేపల పులుసు రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా రోటీల్లో తినవచ్చు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…