Chiranjeevi Rajnikanth : టాలీవుడ్ కొరియోగ్రాఫర్గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన రాకేష్ మాస్టర్ ఈ మధ్య కాలంలో విమర్శలతో వార్తలలోకి ఎక్కుతున్నాడు. దేవుళ్లు, సినిమాలు, సెలబ్రిటీలపై తప్పుడు కామెంట్స్ చేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన రాకేష్ మాస్టర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీ రామారావుని చూసేందుకు రైలు పట్టాలపై నడుచుకుంటూ చెన్నై వెళ్ళేవాడిని అని తెలిపారు. అప్పుడు చిరంజీవి, రజనీ కాంత్ రోడ్లపై తిరుగుతూ ఉండేవారని, అప్పుడు తాను వాళ్ళని పట్టించుకునే వాడిని కాదని ఆయన అన్నారు.
రజనీ కాంత్, శోభన్ బాబు తనతో చాలా క్లోజ్ గా ఉండేవారని అప్పుడప్పుడు తాను మందు కూడా పోసే వాడినని ఆయన అన్నారు. తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి బట్టల షాప్ లో పెట్టారని ఆయన వివరించారు. ఆ సమయంలో తమిళుల చేత చాలా తిట్లు పడ్డానని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు.
రాకేష్ కామెంట్స్పై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన రాకేష్ మాస్టర్ ప్రస్తుతం ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారమవుతున్న డాన్స్ షో ఢీ లో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్గా వ్యవహరించారు. అదే విధంగా జబర్దస్త్ కామెడీ షోకి సంబంధించి పలు ఎపిసోడ్లలో పార్టిసిపెంట్గా కూడా ఆయన పాల్గొన్నారు.