Allu Studios : ఒక్క కార్య‌క్ర‌మంతో పుకార్ల‌కు చెక్‌.. అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించిన చిరంజీవి..!

Allu Studios : హైద‌రాబాద్ మ‌రో ఫిలిం స్టూడియోకు వేదికైంది. ఇప్ప‌టికే అగ్ర హీరోల‌కు చెందిన ఫిలిం స్టూడియోలు ఉండ‌గా.. వాటి స‌ర‌స‌న అల్లు ఫ్యామిలీకి చెందిన అల్లు స్టూడియోస్ వ‌చ్చి చేరింది. అల్లు రామ‌లింగ‌య్య శ‌త జ‌యంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని కోకాపేట‌లో అల్లు అర‌వింద్ నిర్మించిన అల్లు స్టూడియోస్‌ను శ‌నివారం మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అల్లు రామ‌లింగ‌య్య లాంటి మ‌హా న‌టుడి పేరిట ఈ స్టూడియోస్‌ను నిర్మించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. అందుకు గాను అల్లు అర‌వింద్‌ను అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసినందుకు చిరంజీవికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌న క‌ల నెర‌వేరింద‌ని అన్నారు. అలాగే అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అల్లు రామ‌లింగ‌య్య లాంటి మ‌హా న‌టుడి పేరిట స్టూడియోస్ నిర్మించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ప్ర‌జ‌ల ఆశీస్సులు త‌మ‌కు ఎల్ల‌ప్పుడూ ఉంటాయ‌ని తెలిపారు. అల్లు ఫ్యామిలీలో పుట్టినందుకు గ‌ర్విస్తున్నాన‌ని తెలిపారు. ఇక అల్లు స్టూడియోస్ విష‌యానికి వ‌స్తే.. దీన్ని 10 ఎక‌రాల్లో నిర్మించారు. హైద‌రాబాద్‌లోని కోకాపేట‌లో ఈ స్టూడియో ఉంది.

Allu Studios

స‌రిగ్గా ఏడాది కింద ఈ స్టూడియోస్‌కు భూమి పూజ చేశారు. కాగా అక్టోబ‌ర్ 1వ తేదీన అల్లు రామ‌లింగ‌య్య శ‌త జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న జ్ఞాప‌కార్థం ఈ స్టూడియోను నిర్మించారు. దాదాపు పది ఎకరాల్లో ఈ స్టూడియో నిర్మాణం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీతో, ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఈ స్టూడియోని నిర్మించారు. సినిమాకి సంబంధించిన అన్ని పనుల‌ను ఇందులో చేసుకునేలా ప్లాన్‌ చేశారు. ఇక ఈ స్టూడియోని నిర్మాత అల్లు అరవింద్‌ సారథ్యంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తోపాటు ఆయన సోదరులు అల్లు బాబీ (వెంకటేష్‌), అల్లు శిరీష్‌లు కలిసి నిర్మించారు.

షూటింగ్‌లకు సంబంధించిన బిల్డింగ్‌ పనులు పూర్తయ్యాయి. దీంతో షూటింగ్‌ లు చేసుకునేందుకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవితోపాటు అల్లు అరవింద్‌, అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శిరీష్‌, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే గ‌త కొంత కాలంగా మెగా, అల్లు ఫ్యామిలీల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డ్డాయ‌ని వ‌స్తున్న వార్త‌ల‌కు ఈ రోజు చెక్ పెట్టిన‌ట్లు అయింది. అంద‌రూ క‌ల‌సి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డంతో అవ‌న్నీ పుకార్లే అని స్ప‌ష్ట‌మైంది.

Share
IDL Desk

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM