Bigg Boss 5 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం 5వ వారం కూడా పూర్తి కావస్తోంది. ఈ క్రమంలోనే ప్రతివారం మాదిరిగానే శని, ఆదివారాలలో నాగార్జున హౌస్ సభ్యులతో మాట్లాడుతూ వారం రోజులలో వారు చేసిన తప్పుల గురించి కంటెస్టెంట్ లకు గట్టిగా క్లాస్ పీకుతున్నారు. ఎప్పటి మాదిరిగానే ఈ శనివారం కూడా నాగార్జున హౌస్ సభ్యులతో మాట్లాడి వారు చేసిన తప్పుల గురించి కంటెస్టెంట్ లకు వార్నింగ్ ఇచ్చారు.
ఇకపోతే హౌస్ లో ఉన్న 15 మంది కంటెస్టెంట్ లలో సిరి, జెస్సి, షన్ను ముగ్గురు ఒక టీంగా గేమ్ ఆడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నాగార్జున రావడంతోనే అందరి తప్పులను బయటపెట్టడంతోపాటు కంటెస్టెంట్ సిరితో మాట్లాడుతూ ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
సిరి అంటూ ..సిరి గురించి మాట్లాడుతూ.. నువ్వు ఎప్పుడూ ఒకరి వెనకాల మాట్లాడకూడదు.. అంటూ నీతులు చెబుతూ.. నువ్వు చేస్తున్న పని ఏంటి.. అని నాగార్జున ప్రశ్నించడంతో నీళ్లు నమిలిన సిరి.. మా ముగ్గురికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వారితో అలా మాట్లాడాను సార్ అని చెప్పే ప్రయత్నం చేసింది. అదేవిధంగా కెప్టెన్ గా శ్రీరామ్ సేవలను ప్రశంసించారు. ఇక సన్నీ రాజ్యానికి ఒక్కడే రాజ్యం అనే టాస్క్ లో ఓడిపోవడంతో బాధపడకు అని సన్నీతో మాట్లాడారు. శనివారం కార్యక్రమంలో భాగంగా కొండ పొలం టీం బిగ్ బాస్ వేదికపై సందడి చేసింది.