Bhagyashree : రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన అలనాటి హీరోయిన్ భాగ్య శ్రీ. రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన భాగ్యశ్రీ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 32 ఏళ్ల క్రితం మైనే ప్యార్ కియాతో మెరిసిన ఆ మెరుపు మళ్లీ ఇప్పుడు తళుక్కుమంది. అది కూడా 53 ఏళ్ల ప్రాయం వచ్చినా.. చెక్కుచెదరని శరీర సౌష్టవం, అందమైన సొగసుతో కనిపిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఆరోగ్యంగా జీవించడం బరువు తగ్గడంలో ముఖ్యమైన భాగం. అయితే బరువు తగ్గడానికి అనుకూలమైన ఆహారాన్ని అనుసరించే విషయానికి వస్తే, మనలో చాలా మందికి ఏమి తినాలో తెలియక తికమక పడుతుంటారు. వారికి భాగ్య శ్రీ పలు చిట్కాలు అందించింది.
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా ? అయితే వాటర్ వెజిటేబుల్స్ తినండి. మన శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం. మన శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడానికి నీటి ప్రాధాన్యత చాలా ఉంది. నీటి ద్వారా ట్యాక్సిన్స్ తొలగించబడతాయి. నీరు ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పొట్లకాయ, బచ్చలికూర, టొమాటో, క్యాబేజీ, దోసకాయ, పాలకూర, గుమ్మడికాయ వంటి కూరగాయల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. ఈ కూరగాయల్లో డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియకు దోహదపడతాయి. ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.. అని పేర్కొంది.
డైట్లో ఉన్నవారికి లేదా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇవి సరైన కూరగాయలు అని భాగ్య శ్రీ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేసింది. వారంలో ఏడు కూరగాయలను రోజుకు ఒకటి చొప్పున వండుకుని తింటే ఆరోగ్యానికీ మంచిది.. అందంగానూ ఉంటారు.. అని తన అభిప్రాయాన్ని తెలియజేసింది. పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్తో భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 80, 90లలో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ వెలుగు వెలిగిన ఆమె పెళ్లి అనంతరం సినిమాలకు దూరమయ్యారు. రాధేశ్యామ్లో ప్రభాస్కు తల్లి పాత్రతో ఆమె మళ్లీ వెండితెరపై అలరించారు. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా భాగ్యశ్రీ ప్రస్తుతం బాలీవుడ్లో అన్నీ పాత కథలు, కాపీ స్క్రీప్ట్స్ వస్తున్నాయని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…