తమిళ స్టార్ హీరో విజయ్, బుట్ట బొమ్మ పూజా హెగ్డెలు నటించిన తాజా చిత్రం.. బీస్ట్. ఈ మూవీ ఏప్రిల్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే విడుదలైన మొదటి రోజు నుంచే ఈ మూవీకి భారీ ఎత్తున నెగెటివ్ టాక్ వచ్చింది. సాక్షాత్తూ విజయ్ అభిమానులే సినిమా బాగా లేదని చెన్నైలో ఓ చోట ఏకంగా స్క్రీన్ను తగులబెట్టారు. దీంతో సినిమా ఏ రేంజ్లో ఫ్లాప్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మించింది. కనుక సన్ నెక్ట్స్ యాప్లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.
కాగా బీస్ట్ చిత్రం మరీ పేలవంగా ఉందని చాలా చోట్ల కామెంట్స్ వినిపించాయి. అయితే భారీ ఎత్తున రిలీజ్ చేశారు కనుక పెట్టిన డబ్బు వచ్చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. కానీ ఒక్క చిత్ర పరిశ్రమలోనూ మంచి టాక్ను సాధించలేకపోయింది. ఇక ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. సన్ పిక్చర్స్కు చెందిన సన్ నెక్ట్స్ యాప్తోపాటు ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్లోనూ బీస్ట్ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయిన కారణంగా చాలా త్వరగానే ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు.
ఈ మూవీ ఏప్రిల్ 13వ తేదీన విడుదల అయింది కనుక మే 13వ తేదీ తరువాతే వాస్తవానికి ఓటీటీలో రావాల్సి ఉంది. కానీ ఫ్లాప్ టాక్ను మూట గట్టుకుంది కనుక ఒక వారం ముందే.. అంటే.. మే 5 లేదా 6వ తేదీల్లో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మొదటి రోజుల్లోనే రూ.150 కోట్లు వచ్చేశాయి. ప్రి రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. కనుక నెగెటివ్ టాక్ వచ్చినా.. లాస్ అనేది ఏర్పడలేదని సమాచారం.