Anasuya : బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం తన కెరీర్లో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా పలు అంశాలపై స్పందిస్తూ తన దైన శైలిలో సెటైర్లు వేయడం చేస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా తన గురించి వచ్చే నెగెటివ్ కామెంట్స్ ను తిప్పికొడుతూ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న అనసూయ తాజాగా ట్విట్టర్ ద్వారా మరొక విషయంపై స్పందిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసింది.
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే పిల్లలను స్కూలుకు పంపించాలని తల్లిదండ్రులపై అధిక ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉండగా పిల్లలకు పాఠశాలలో ఎలాంటి ప్రమాదం జరిగినా స్కూల్ యాజమాన్యం బాధ్యత కాదని.. తల్లిదండ్రుల నుంచి డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ అక్కడక్కడ కేసులు నమోదు అవుతూ ఉన్నాయి.
అయితే కరోనా కేసులు తగ్గడంతో తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అలాగే వాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలోనే ఈ విషయంపై అనసూయ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సర్.. కరోనా కేసుల కారణంగా మనం లాక్ డౌన్ నిర్వహించాము. అలాగే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. మరి కరోనా వ్యాక్సిన్ తీసుకోని చిన్నారుల పరిస్థితి ఏంటి ? పిల్లలకు ఏమైనా జరిగితే అందుకు తాము బాధ్యులు కామని స్కూల్ యాజమాన్యాలు తెలియజేస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం సర్.. అంటూ ఆమె మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…