Aamani : జంబలకిడిపంబ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అలనాటి అందాల తార ఆమని. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమాతో ఆమని కెరీరే మారిపోయిందని చెప్పవచ్చు. ఇక ఆమె మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’, ‘అమ్మదొంగ’ వంటి ఎన్నో చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె సహాయ నటి పాత్రలు పోషిస్తూ మరోవైపు ధారావాహికల్లోనూ నటిస్తోంది.
అయితే హీరోయిన్స్ పలు సందర్భాలలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోగా, ఈ మధ్య ఆ విషయాలపై మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. తాజాగా ఆమని ఆమె సినీ కెరీర్లో ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలను చవిచూశాను అని ఆమె వెల్లడించింది. సినిమాలో నటించే ఆసక్తి ఉందని కొందరిని సంప్రదిస్తే.. వాళ్లు అంతా ఓకే అన్నాక.. గెస్ట్ హౌస్ కి వచ్చేయ్ అనే వాళ్లు .. దీంతో నాకు గెస్ట్ హౌస్ అంటేనే అనుమానం వచ్చింది.
నువ్వు ఒక్కదానివే రా, మీ అమ్మను తీసుకురాకు అని చెప్పేసరికి వారి మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉందో అర్ధమై దూరంగా ఉండేదానిని అని ఆమని చెప్పుకొచ్చింది. ఈవిడకి అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఇటీవలే చావు కబురు చల్లగా చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది. బుల్లితెరపై కూడా తన టాలెంట్ ను చూపిస్తూ మెప్పిస్తోంది.