lifestyle

Lakshadweep : లక్షద్వీప్‌కు వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే ముందుగా ఈ 7 ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి..!

Lakshadweep : ప్రధాని మోదీ ఇటీవలే లక్షద్వీప్‌కు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై మాల్దీవ్స్‌కు చెందిన మంత్రులు కామెంట్స్‌ చేయడం, వెంటనే పెద్ద ఎత్తున భారత్‌ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం, మాల్దీవ్స్‌కు విమానాలు, అక్కడి హోటల్స్‌లో రూమ్‌లను భారతీయులు పెద్ద ఎత్తున క్యాన్సిల్‌ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే దిగి వచ్చిన మాల్దీవ్స్‌ ప్రభుత్వం సదరు మంత్రులను సస్పెండ్‌ చేయడమే కాకుండా మోదీకి క్షమాపణలు కూడా చెప్పింది. అయినప్పటికీ మాల్దీవ్స్‌పై భారతీయులు ఆగ్రహంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్‌కు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే అక్కడికి వెళ్లే ముందు ఈ ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందుల్లో పడిపోతారు. ఇక ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మాల్దీవ్స్‌లాగే లక్షద్వీప్‌ కూడా ఎంతో సుందరమైన ప్రదేశం. ఇక్కడి సముద్రపు జలాలు, అద్భుతమైన బీచ్‌లు, కోరల్‌ రీఫ్‌, దీవులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది పర్యాటకులు లక్షద్వీప్‌ను సందర్శిస్తుంటారు కూడా. అయితే లక్షద్వీప్‌ను సందర్శించాలంటే ఎవరికైనా సరే.. ఆఖరికి భారతీయులు అయినా సరే ముందస్తు అనుమతి తప్పనిసరి. అక్కడికి వెళ్లాలంటే 3 నెలలు ముందుగా పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు వంటి వివరాలను తెలియజేయాలి. ఆ తరువాతే పర్మిట్‌ ఇస్తారు. ఇందుకు 3 నెలలు పడుతుంది. కనుక ఎవరైనా లక్షద్వీప్‌ను సందర్శించాలనుకుంటే ముందుగా ఈ పర్మిట్‌ను తెచ్చుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం.

Lakshadweep

ఇక లక్షద్వీప్‌ను సందర్శించేందుకు చలికాలం చాలా అనువైన సమయం అని చెప్పవచ్చు. ఈ సమయంలో పర్యాటకులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కనుక డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. లక్షద్వీప్‌లో పర్యాటకులు అనేక యాక్టివిటీస్‌ చేయవచ్చు. స్నోర్‌కెలింగ్‌, స్కూబా డైవింగ్‌ వంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

లక్షద్వీప్‌కు చేరుకోవాలంటే కొచ్చి వెళ్లి అక్కడి నుంచి బోట్‌ లేదా విమానంలో వెళ్లవచ్చు. లేదా బెంగళూరు, చెన్నై నుంచి కూడా నేరుగా విమానాల్లో వెళ్లవచ్చు. లక్షద్వీప్‌లో మీరు డిజిటల్‌ ప్రపంచం నుంచి దూరంగా ఉండవచ్చు. ఎంతో సుందరమైన ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదించవచ్చు. దీంతో మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడి బీచ్‌లు, నోట్లో నీళ్లూరించే ఫుడ్స్‌ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. లక్షద్వీప్‌కు వెళ్లాలంటే పెద్దగా లగేజీ తీసుకెళ్లకండి. లైట్‌ వెయిట్‌గా వెళ్లండి. అలాగే స్విమ్‌ వేర్‌, సన్‌ స్క్రీన్‌ లోషన్స్‌, సన్‌ గ్లాసెస్‌ వంటివి తీసుకెళ్లడం మరిచిపోవద్దు.

లక్షద్వీప్‌లో పర్యాటకులకు బస చేసేందుకు అనేక రకాల కాటేజీలు, హోటల్స్‌ అందుబాటులో ఉన్నాయి. అక్కడి ఎకో ఫ్రెండ్లీ కాటేజీలు లేదా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీచ్‌ హట్స్‌, లేదా ప్రైవేటు రిసార్ట్స్‌, హోటల్స్‌లోనూ పర్యాటకులు బస చేయవచ్చు. ఇలా లక్షద్వీప్‌ ను ఎవరైనా సరే సునాయాసంగా చుట్టి రావచ్చు. కానీ పైన తెలిపిన విషయాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి.

Share
IDL Desk

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM