మాంసాహారం

రాయలసీమ స్పెషల్.. నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

రాయలసీమ స్పెషల్ అంటేనే అందరికీ టక్కున గుర్తొచ్చే నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు అంటేనే ప్రతి ఒక్కరు నోట్లో నీళ్లు ఊరుతాయి. ఎంతో రుచిగా ఉండే రాయలసీమ నాటుకోడి పులుసు తినడానికి వివిధ ప్రాంతాల వారు ఎంతో ఇష్టపడుతుంటారు. నాటుకోడి లోకి రాగి ముద్దను తింటే ఆ రుచే వేరు . ఇలా చెబుతూ ఉంటే మీకు నాటుకోడి తినాలనిపిస్తుంది కదూ.. ఇంకెందుకు ఆలస్యం ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

*నాటుకోడి చికెన్ 500 గ్రాములు

*వెల్లుల్లి ఒకటి

*ఉల్లిపాయ ఒకటి

*కొత్తిమీర

*అల్లం

*కొబ్బెర చిన్నకప్పు

*లవంగాలు 6

*ధనియాలు

*ఎండు మిరపకాయలు

*నిమ్మకాయ ఒకటి

*పసుపు చిటికెడు

*ఉప్పు తగినంత

*మూడు టేబుల్ టీస్పూన్ల నూనె

తయారీ విధానం:

స్టవ్ పై ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఎండుమిరపకాయలు, లవంగాలు, ధనియాలను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తరువాత రోట్లో ఎండు మిరపకాయలు, ధనియాలు, లవంగాలు, కొబ్బెర, కొత్తిమీర, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చికెన్ తయారు చేయడానికి ముందుగా మసాలాను ఈ విధంగా తయారుచేసి పెట్టుకోవాలి.

తర్వాత చికెన్ ను ఒక గిన్నెలో వేసుకుని శుభ్రం చేసుకోవాలి. అందులో నిమ్మకాయ కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై కుక్కర్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కాక మనకు అవసరం అయితే పోపు పెట్టుకోవచ్చు లేకపోతే నూనె వేడెక్కిన తర్వాత చికెన్ వేయాలి. చికెన్ బాగా కలియబెడుతూ రెండు నిమిషాలపాటు నూనెలో మగ్గనివ్వాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి మరో ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత ముందుగా తయారు చేసుకున్న మసాలా వేసి బాగా కలియబెట్టాలి. స్టవ్ సిమ్ లో ఉంచుకొని ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా చేయటం వల్ల మసాలా పచ్చి వాసన రాకుండా చికెన్ ముక్కలకు ఉప్పు, కారం బాగా పడుతుంది.

ఐదు నిమిషాల తర్వాత కుక్కర్ లో నీళ్ళు పోసి మూత పెట్టి ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ప్రెజర్ వెళ్లే వరకు వేచి ఉండాలి. ప్రెజర్ వెళ్ళిన తరువాత మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఐదు నిమిషాల పాటు సిమ్ లో ఉడికించడంతో ఎంతో రుచి కరమైన రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు తయారు అవుతుంది. నాటుకోడి పులుసు తాగడానికి ఎంతో మంది ఇష్టపడతారు. ఈ పులుసు తాగటం వల్ల జలుబు, దగ్గు కఫం వంటి సమస్యలు తొలగిపోతాయి. అందుకే నాటు కోడి పులుసు అంటే ఎంతోమంది ఇష్టంగా తింటారు.

Share
Sailaja N

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM