Touching Elders Feet : మన కన్నా పెద్ద వారి కాళ్లకు వంగి దండం పెట్టి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది భారతీయ సాంప్రదాయంలోనే ఉంది. మన దేశంలో అనేక వర్గాలకు చెందిన వారు ఈ ఆచారాన్ని పాటిస్తారు. దీంతో పెద్దల ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని దాంతో పిల్లలకు సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని అందరూ నమ్ముతారు. ఆ కోవలోనే ఎవరైనా తమ కన్నా వయస్సులో పెద్ద అయిన వారి కాళ్లకు నమస్కరిస్తారు. అయితే నిజానికి ఇందులో మనకు తెలియని పలు విషయాలు దాగి ఉన్నాయి. శాస్త్రం పరంగానే కాదు, సైన్స్ పరంగా కూడా ఇలా చేయడం మనకు మంచిదే. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేహంలో పాదాలు అనేవి మన శరీరం మొత్తం బరువును మోస్తాయి. అవి మన దేహానికి ఆధారం వంటివి. అవి లేకుండా మనం నిలుచులేం. సృష్టిలో కేవలం కొన్ని పక్షులు, జంతువులకు తప్ప ఇలా పాదాలపై అదే పనిగా నిలబడగలిగే సామర్థ్యం ఏ జీవికీ లేదు. అందుకే అలాంటి పాదాలకు నమస్కరించాలని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే మనం పెద్దవాళ్ల పాదాలకు నమస్కరిస్తాం.
పెద్దవాళ్లంటే.. వారికి జీవితంపై ఎంతో అనుభవం ఉంటుంది. పిల్లల కన్నా ఎంతో జ్ఞానాన్ని వారు కలిగి ఉంటారు. వారికి చాలా విషయాలు తెలిసి ఉంటాయి. అలాంటప్పుడు వారి పాదాలకు నమస్కరిస్తే వారి జ్ఞానం, తెలివి తేటలు, జీవిత అనుభవం అన్నీ పిల్లలకు వస్తాయని, వారు జీవితంలో విజయవంతంగా ముందుకు సాగుతారని విశ్వసిస్తారు. కనుకనే పెద్దల పాదాలకు పిల్లలు నమస్కరిస్తారు.
పెద్దల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం పొందితే వారి విజ్ఞానం పిల్లలకు అందుతుందని అధర్వణ వేదం చెబుతోంది. పెద్దల పాదాలకు నమస్కరించినప్పుడు వారిలో ఉండే పాజిటివ్ శక్తి పిల్లలకు చేరుతుందట. అలాగే పిల్లల్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ పెద్దలకు ప్రసారమవుతుందట. దీంతో ఇద్దరికీ ఉండే ఆరోగ్య సమస్యలు పోతాయట. సైన్స్ ప్రకారం అలా వంగి పాదాలకు నమస్కరిస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుందట. దీంతో గుండె సమస్యలు రావట.
ఇవీ.. పెద్దల పాదాలకు నమస్కారం చేయడానికి, వారి ఆశీస్సులు తీసుకోవడానికి వెనుక ఉన్న కారణాలు. అయితే పాదాలకు నమస్కరించినప్పుడు కుడి చేతితో కుడి పాదాన్ని, ఎడమ చేతితో ఎడమ పాదాన్ని తాకి నమస్కారం తీసుకోవాలట. అలా నమస్కారం చేయడమే సరైందని పురాణాలు చెబుతున్నాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…