హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో వచ్చే తొలి పండుగను నాగ పంచమి అంటారు. శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు పెద్ద ఎత్తున భక్తులు పుట్టను సందర్శించి పుట్టలో పాలు పోస్తారు.
అదేవిధంగా నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ విధంగా నాగపంచమి పండుగను జరుపుకోవడానికి కారణం ఏమిటి? ఈ పండుగ విశిష్టత ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం ఆదిశేషుడు విష్ణుమూర్తిని ఒక కోరిక కోరాడు. తాను ఉద్భవించిన రోజు లోకం మొత్తం తనకు పూజలు చేయాలనే కోరిక కోరడం చేత నాగ పంచమి రోజు చాలామంది ప్రజలు సర్పరాజుకు పూజలు చేస్తారు.
ఈ ఏడాది నాగపంచమి ఆగస్టు 13వ తేదీ వచ్చింది. ఈరోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని పుట్టలో పాలు పోసి నాగ పంచమి వేడుకలను జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసంతో నాగదేవతను పూజించడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్య ఫలం కలుగుతుంది.
నాగ పంచమి రోజు స్వామివారికి గోధుమ రవ్వతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టి పూజ చేయటం వల్ల దేవత సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి.
మరీ ముఖ్యంగా ఈ నాగ పంచమి రోజు తొమ్మిది రకాల పాములకు పూజిస్తారు. ఆ తొమ్మిది రకాల పాములు ఏమిటంటే.. అనంత, వాసుకి, శేష, కలియ, శంఖపాల, తక్షక, కంబాల, ధ్రుత రాష్ట్రం, పద్మనాభం వంటి రకాలను పూజిస్తారు.