హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశి రోజు వినాయక చవితి ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ క్రమంలోనే వినాయక చవితి ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం వచ్చింది. ఈ క్రమంలోనే భక్తులు పెద్ద ఎత్తున వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ స్వామి వారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి స్వామివారి పూజలో పాల్గొంటారు.
మనం వినాయకుడిని తొలి పూజ్యుడిగా భావిస్తాము. మనం ఏదైనా ఒక శుభకార్యాన్ని చేయాలని భావించినప్పుడు ఆ శుభకార్యంలో ఆటంకాలు కలగకుండా ఉండాలని వినాయకుడికి పూజ చేస్తాం. ఎంతో పవిత్రమైన ఈ వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని చెబుతారు. వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారు ఆ ఏడాదిలో నీలాపనిందలు పాలవుతారని, అందుకోసమే చంద్రుని చూడకూడదని పురాణాలు చెబుతున్నాయి. అసలు చంద్రుడిని వినాయక చవితి రోజు ఎందుకు చూడకూడదనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
వినాయక చవితి రోజు వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా గణపతికి విఘ్నాధిపతిగా ఆధిపత్యం కట్టబెట్టడం వల్ల ఆరోజు వినాయకుడికి భక్తితో కుడుములు, ఉండ్రాళ్ళు వంటి వివిధ రకాల పిండి వంటలు, పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ క్రమంలోనే వాటన్నింటిని తిన్న వినాయకుడికి పొట్ట లావుగా ముందుకు రావడంతో ఎంతో ఇబ్బంది పడతాడు. దీంతో అది చూసిన చంద్రుడు నవ్వడంతో ఆగ్రహం చెందిన పార్వతీ దేవి ఎవరైతే వినాయక చవితి రోజు చంద్రుని వంక చూస్తారో అలాంటివారిపై నీలాపనిందలు వస్తాయని శాపం పెడుతుంది. అందుకే వినాయక చవితి రోజు చంద్రుడి వంక చూడకూడదని పురాణాలు చెబుతున్నాయి.