తల్లి ఉందన్న ధైర్యంతో ఆ కొడుకు రాత్రంతా తన తల్లి పక్కనే పడుకున్నాడు. అయితే తన తల్లి మరణించిందనే విషయం తెలియక ఆ కొడుకు రాత్రంతా తల్లి చెంత పడుకొని నిద్రపోయాడు. ఎప్పటిలాగే మరుసటి రోజు ఉదయం ఆ కొడుకు లేచి తన తల్లిని నిద్రలేపాడు. అయితే ఎంత సేపటికీ ఆమె నిద్ర లేకపోవడంతో ఎంతో కంగారుపడిన ఆ బాలుడు తన తల్లి మరణించిందనే విషయం తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అతను రోధిస్తున్న ఘటన అందరినీ కలచివేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అశ్వారావుపేట టౌన్ సంతపాకలో నిర్మల (45), కొడుకు కృష్ణ(7)తో కలసి ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నిర్మల ఎలాంటి వైద్యం చేయించుకోకుండా ఉండటమే కాకుండా, తీవ్రమైన చలి, వర్షానికి ఉండటం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించి పోయింది. దీంతో తన కొడుకు కృష్ణను తన పక్కన పడుకోబెట్టుకుని రాత్రికి రాత్రి నిద్రలోనే మరణించింది.
అయితే తన తల్లి పక్కన పడుకున్నానన్న ధైర్యంతో ఆ బాలుడు తెల్లవారే వరకు తన తల్లి చెంత నిద్ర పోయాడు. ఉదయం కృష్ణ నిద్రలేచి తన తల్లిని నిద్ర లేపగా తన తల్లి లేవకపోవడంతో కంగారుగా చుట్టుపక్కల వారికి ఈ విషయం తెలియజేశాడు. ఈ క్రమంలోనే స్థానికులు ఆమె మరణించిందని వార్త చెప్పడంతో కృష్ణ ఎంతో రోదించాడు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి ఆధార్ కార్డులు తీసుకొని వారి బంధువులకు సమాచారం అందించారు. అయితే తన తల్లి మరణించిందనే వార్త తెలియకుండానే తెల్లవార్లూ తన తల్లి చెంత పడుకున్న కృష్ణను చూసి అక్కడున్న వారందరూ కన్నీరు పెట్టుకున్నారు.