పురిటి నొప్పులతో ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహించారు. సరైన సమయంలో వైద్యం అందించలేదు. ఆమె పట్ల ఎంతో నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో ఆ మహిళ ప్రాణాలు పోయాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి అనూష అనే మహిళ రెండవసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే ఆమెకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం వెంటనే రాత్రి 8 గంటల సమయంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం అవుతుందని వేచి చూశారు. అయితే అనూషకి పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో తన బాధను చూడలేక కుటుంబసభ్యులు తనకు ఆపరేషన్ చేయాలని వైద్యులను కోరారు. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల సమయంలో అనూష సిజేరియన్ ద్వారా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సిజేరియన్ చేసిన తర్వాత వైద్యులు అనూష పట్ల నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆమెకు అధిక రక్తస్రావం జరిగి.. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయింది.
ఈ విషయాన్ని గుర్తించిన వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకుండా ఆమెను ఆంబులెన్స్ లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఏం జరిగిందని ఆరాతీస్తే అసలు విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు సైతం ఆంబులెన్స్ లో కరీంనగర్ ఆస్పత్రికి బయలుదేరగా.. అప్పటికే అనూష మరణించిందని చెప్పడంతో.. బాధిత కుటుంబ సభ్యులు అనూష మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలను కోల్పోయిందంటూ.. ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. పేషంట్ ల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించే వైద్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…