క్రైమ్‌

అర‌కులోయ‌లో విషాదం.. త‌ల్లి, ముగ్గురు పిల్ల‌ల మృతి..

విశాఖ‌ప‌ట్నం జిల్లా ప‌రిధిలోని అర‌కు లోయ‌లో విషాదం జ‌రిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఓ మ‌హిళతోపాటు ఆమెకు చెందిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్ర‌మంలో న‌లుగురి మృత‌దేహాలు ఇంట్లో క‌నిపించాయి. దీంతో ఈ సంఘ‌ట‌న అనేక అనుమానాల‌ను క‌లిగిస్తోంది. స‌ద‌రు మ‌హిళే త‌న పిల్ల‌ల‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకుందా ? లేదా ఆమె భ‌ర్త ఈ విధంగా చేశాడా ? అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది.

అరకులోయ పట్టణం పరిధిలోని పాత పోస్టాఫీస్‌ కాలనీలో ఓ మ‌హిళ‌, ఆమె ముగ్గురు పిల్ల‌లు మృతి చెందారు. ఆమె ఓ గదిలో ఉరి వేసుకొని చనిపోయింది. కాగా ఆమె ముగ్గురు పిల్ల‌లు ఇంకో గదిలో చ‌నిపోయారు. అయితే వారిని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లగా అప్పటికే వారు చ‌నిపోయార‌ని వైద్యులు తెలిపారు.

అరకులోయ మండలం కొత్త బల్లుగూడ పంచాయతీ సిమిలిగూడ గ్రామానికి చెందిన శెట్టి సంజీవరావు జీసీసీలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. భార్య శెట్టి సురేఖ (34), కుమార్తె సుశాన్‌ (10), కుమారులు సర్విన్‌ (8), సిరిల్‌(4)లతో కలిసి పాత పోస్టాఫీస్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ఆ ఇద్ద‌రు దంప‌తుల‌ మధ్య కొంత కాలంగా గొడ‌వ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భర్త సంజీవరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 10 గంటలకు ఇంటికి వ‌చ్చాడు. అయితే అప్ప‌టికే మంచంపై ప‌డి ఉన్న త‌న ముగ్గురు పిల్లలను చూసి స్థానికుల సహాయంతో వెంట‌నే అక్క‌డి ఏరియా హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాడు.

పిల్లలను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మరోవైపు తల్లి సురేఖ కోసం గాలించగా మరో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. పిల్లలకు అన్నంలో విషం కలిపి తినిపించి, సురేఖ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు ఆధారాలు లభించాయని అరకు పోలీసులు తెలిపారు. వంట గదిలో సగం తిన్న భోజనం ప్లేట్లు ఉన్నాయని చెప్పారు. అయితే సంజీవ‌రావే తమ కూతురు, మనవలను హత్య చేసి నాటకాలు ఆడుతున్నాడని సురేఖ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Share
IDL Desk

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM