తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పరకాలలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తాత మృతదేహాన్ని ఫ్రిజ్లో దాచి ఉంచాడు. దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
వరంగల్ జిల్లా పరకాలకు చెందిన 23 ఏళ్ల నిఖిల్ అనే యువకుడి తాత అనారోగ్య సమస్యల కారణంగా గత 3 రోజుల కిందట మృతి చెందాడు. అయితే అతని మృతదేహాన్ని నిఖిల్ ఫ్రిజ్ లో దాచి ఉంచాడు. మూడు రోజుల పాటు అలా ఉన్నాక దుర్వాసన వస్తుండడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిఖిల్ తాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని మార్చురీకి తరలించారు.
అయితే తన వద్ద డబ్బులు లేనందునే తన తాత అంత్యక్రియలు చేయలేదని, అందుకనే డెడ్ బాడీని ఫ్రిజ్ లో దాచి ఉంచానని నిఖిల్ పోలీసుల విచారణలో తెలిపాడు. కాగా అతని తాతకు పెన్షన్ వస్తుండేది. దానిపైనే ఇద్దరూ జీవించే వారు. సడెన్ గా నిఖిల్ తాత చనిపోవడంతో తనకు ఇక ఖర్చులకు ఉండవని భావించిన నిఖిల్ కావాలనే తన తాత మృతదేహాన్ని దాచి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…