క్రైమ్‌

భార్యను చిత్రహింసలకు గురి చేసిన భర్త.. నరకం అంటే ఏమిటో చూపించాడు.. చివరకు ఏమైందంటే ?

సాధారణంగా పెళ్ళి అయిన తర్వాత ప్రతి ఒక్క భర్త తనకు సంతానం కలగాలని తన భార్యను ఎంతో ఉన్నతంగా చూసుకోవాలని భావిస్తాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. పెళ్లి అయిన తరువాత తన భార్యకు నరకం అంటే ఏమిటో చూపించాడు. దీంతో అతని చిత్ర హింసలను తట్టుకోలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు అతన్ని కటకటాల వెనక్కి పంపించారు. వివరాల్లోకి వెళితే..

విజయవాడకు చెందిన జోత్స్న అనే యువతి ఎంబీఏ చదివి బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ఆ సమయంలోనే సుశాంత్ చౌదరి అనే వ్యక్తి జోత్స్నను ప్రేమించి తన ప్రేమ విషయాన్ని ఆమెకు తెలియజేశాడు. అందుకు జోత్స్న ఒప్పుకోకపోవడంతో అతను చనిపోతానని బెదిరించాడు. దీంతో ఆమె ఆ ప్రేమను అంగీకరించాల్సి వచ్చింది. అయితే ఇద్దరూ ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో వారి పెళ్లి విషయం వారి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు వీరిద్దరికీ ఎంతో అంగరంగ వైభవంగా వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.  యువతి తల్లిదండ్రులు పెద్దఎత్తున కట్న కానుకలను సమర్పించారు.

ఈ విధంగా పెళ్లి తర్వాత బెంగళూరులో నివాసమున్న ఈ జంట కొన్ని రోజులకు సుశాంత్ చౌదరి గ్రామానికి వచ్చారు. ఎప్పుడైతే జోత్స్న అత్తారింట్లో నివాసం ఉంటుందో అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఎవరో మాంత్రికుడు తన ఇంటి వారసులను బలిస్తే వారికి లంకెబిందెలు దొరుకుతాయని చెప్పడంతో కుటుంబ సభ్యులు మొత్తం ఆమెపై అధిక ఒత్తిడి తెచ్చి పిల్లల్ని కనాలని తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవారు. ఇదే విషయమే తన తల్లిదండ్రులతో చెప్పడం వల్ల తల్లిదండ్రులు మందలించి వీరిద్దరిని బెంగళూరుకు పంపించారు. అక్కడికి వెళ్లినప్పటికీ ఆమెకు ఏమాత్రం బాధలు తప్పలేదు. ఈ క్రమంలోనే సుశాంత్ చౌదరి నువ్వు పిల్లల్ని కనిస్తావా.. లేకపోతే నేను మరొకరితో పిల్లల్ని కనాలా.. అంటూ ఆమెను తరచూ చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో జోత్స్న తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకొని పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Share
Sailaja N

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM