బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ కార్యక్రమం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ కార్యక్రమం గురించి తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ కార్యక్రమానికి గత 2 సీజన్ల నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే 5వ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనుండడంతో ఈ కార్యక్రమంపై ఎన్నో అంచనాలు పెరిగాయి.
సెప్టెంబర్ 5వ తేదీన ప్రసారం కాబోయే ఈ కార్యక్రమం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. సీజన్ ఫైవ్ లో పాల్గొని కంటెస్టెంట్ లు వెళ్లే అంటూ పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరినీ క్వారంటైన్ కి పంపించారు. ఇక రెండు రోజుల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎవరనేది తెలియనుండడంతో బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించే నాగార్జున తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈసారి ప్రసారం కాబోయే బిగ్ బాస్ కార్యక్రమంలో ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని, ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని తెలిపారు. కొత్త కంటెస్టెంట్స్ తో కొత్త కార్యక్రమం కోసం టీం మొత్తం గత కొన్ని నెలల నుంచి ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. కొత్త సీజన్ లో కొత్త కంటెస్టెంట్ లతో ఈ కార్యక్రమం చేయడం ఎంతో చాలెంజింగ్ గా ఉంటుందని, తప్పకుండా ఈ సీజన్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి బాగా నచ్చుతుందని ఈ సందర్భంగా నాగార్జున తెలియజేశారు.