Rana : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ చిత్రాల హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. నేటి యంగ్ హీరోలు ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రానా ప్రభాస్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకమైన బాహుబలి చిత్రంలో నటించారు. అదేవిధంగా వెంకటేష్, రానా కలిసి మరో మల్టీస్టారర్ చిత్రంగా రాబోతుందని ఇదివరకే అధికారికంగా ప్రకటన చేశారు. ఇలా మల్టీస్టారర్ చిత్రాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్న రానా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ చిత్రంలో రానా డానియల్ శేఖర్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇలా వరుసగా మల్టీస్టారర్ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న రానా తాజాగా మరో మల్టీ స్టారర్ చిత్రంతో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రానా మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ శర్వానంద్ మల్టీస్టారర్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమస్థలో సహాయ దర్శకుడిగా పని చేసినటువంటి ఒక యువ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకుడిగా పని చేయనున్నట్లు సమాచారం. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుందని దగ్గుబాటి రానా చాలా కాన్ఫిడెన్స్ గా ఈ చిత్రానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక శర్వానంద్ కూడా సినిమా కథాంశం నచ్చడంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.