సాధారణంగా చాలా మందికి పాత కాలానికి సంబంధించిన రూపాయి, పావలా, అర్థ పావలా నాణేలను భద్రపరచడం అలవాటుగా ఉంటుంది. ఇలా ఈ నాణేలను కొంతమంది అధిక ధరలకు అమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక రూపాయి నాణెం ఏకంగా 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఆన్లైన్లో ఈ విధమైనటువంటి నాణేల అమ్మకాలు అధికమయ్యాయి. ఈ విధంగా ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి ఒక రూపాయి నాణెం ఆన్లైన్ అమ్మకాలలో ఏకంగా రూ.10 కోట్లకు అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంత మొత్తంలో ఖరీదు చేసేంత ప్రాముఖ్యత ఆ రూపాయి నాణెంలో ఏముంది ? అంత ధర పలకడానికి గల కారణం ఏమిటి ? అనే విషయాలకు వస్తే..
రూ.10 కోట్ల విలువ చేసిన ఈ రూపాయి నాణెం ఇప్పటి కాలానిది కాదు. దీనిని 1885 లో భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో విడుదల చేశారు. ఈ రూపాయి నాణెం ఓ వ్యక్తి దగ్గర ఉండగా ఆ వ్యక్తి దానిని తాజాగా ఒక వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలోనే ఆ రూపాయిని ఏకంగా ఒక వ్యక్తి రూ.10 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.