టెలికాం సంస్థ రిలయన్స్ జియో అత్యంత చవక ధరకే జియో ఫోన్ నెక్ట్స్ పేరిట గూగుల్తో కలిసి ఓ స్మార్ట్ ఫోన్ను రూపొందిస్తున్న విషయం విదితమే. ఆ ఫోన్ను వినాయక చవితి కానుకగా విడుదల చేయనున్నామని కూడా జియో గత నెలలో ప్రకటించింది. అయితే జియో ఫోన్ నెక్ట్స్ విడుదల ఆలస్యం కానుంది. ఈ విషయాన్ని జియో తెలియజేసింది.
జియో ఫోన్ నెక్ట్స్ ఫోన్లో ఉపయోగించే చిప్లకు గాను కొరత ఏర్పడిందని, అందువల్ల ఫోన్ లాంచింగ్ ను వాయిదా వేస్తున్నామని జియో ప్రకటించింది. వాస్తవానికి వినాయక చవితి రోజు ఈ ఫోన్ను లాంచ్ చేయాల్సి ఉందని, కానీ దీపావళి రోజు ఈ ఫోన్ను ఆవిష్కరిస్తామని తెలిపింది. అందువల్ల జియో ఫోన్ నెక్ట్స్ రావాలంటే దీపావళి వరకు వేచి చూడక తప్పదు.
ఈ ఫోన్లో అద్భుతమైన ఫీచర్లను అందించడంతోపాటు రెండు మోడల్స్ లో ఈ ఫోన్ను లాంచ్ చేస్తారని తెలుస్తోంది. రూ.500, రూ.700 చెల్లించి ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. వాటి ధర రూ.5వేలు, రూ.7వేలుగా ఉంటాయని సమాచారం. ఈ క్రమంలోనే మిగిలిన మొత్తాన్ని సులభమైన నెలసరి వాయిదా పద్థతుల్లో చెల్లించే అవకాశాన్ని జియో కల్పిస్తుందని తెలుస్తోంది. అందువల్ల జియో ఫోన్ నెక్ట్స్ కోసం దీపావళి వరకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.