హిందువులు జరుపుకునే ఎన్నో ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి పండుగ రోజు భక్తులు పెద్ద ఎత్తున లంబోదరుడికి పూజలు నిర్వహిస్తూ వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో వినాయకుడి ప్రతిమలను ప్రతిష్టించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఈ విధంగా వినాయకుడికి పూజ చేయడం వల్ల అన్ని శుభాలను ప్రసాదిస్తాడని, మనకు ఏ విధమైన కష్టాలు రాకుండా కాపాడుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ విధంగా స్వామివారికి పూజ చేసే సమయంలో తప్పనిసరిగా స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన పుష్పాలను సమర్పించండి వల్ల వినాయకుడు ఎంతో ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. మరి వినాయకుడి పూజలో అంత ముఖ్యమైన పుష్పం ఏంటి అనే విషయానికి వస్తే..
వినాయకుడి పూజలో స్వామివారికి ఎంతో ఇష్టమైన బంతి పువ్వులను సమర్పించాలి. బంతి పువ్వు శుభానికి సూచిక. అదేవిధంగా బంతి పువ్వు మన ఇంట్లో ఎల్లప్పుడూ అనుకూల వాతావరణాన్ని కలిగించటానికి దోహదపడుతుంది. కనుక వినాయకుడి పూజలో బంతి పువ్వును స్వామివారికి సమర్పించడం వల్ల అన్నీ శుభాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కేవలం వినాయకచవితి రోజు మాత్రమే కాకుండా మనం ఎప్పుడు పూజ చేసినా స్వామివారి పూజకు బంతిపూలను వాడుతుండాలి. దీంతో ఆయన అనుగ్రహం భక్తులపై ఉంటుంది.