ప్రమాదాలు అనేవి మనకు చెప్పివారు. చెప్పకుండానే వస్తాయి. అయితే అలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు కొందరు లక్కీగా బయట పడుతుంటారు. అక్కడ కూడా సరిగ్గా అలాగే జరిగింది. ఓ కుటుంబం మొత్తం నేలపై కూర్చుని ఎంతో సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుండగా.. వారి మీద సీలింగ్ ఫ్యాన్ ఊడి పడింది. కానీ అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు.
వియత్నాంలోని బాక్ నిహ్ అనే ప్రాంతంలో ఓ కుటుంబంలోని 6 మంది నేలపై కూర్చుని భోజనం చేస్తున్నారు. అయితే పైన ఉన్న సీలింగ్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఊడి వారి మీద పడింది. కానీ ఆశ్చర్యకరంగా ఎవరికీ ఏమీ కాలేదు.
అయితే ఆ ఫ్యాన్ ను ఆ కుటుంబ పెద్ద తీసి పక్కన పెట్టగా, వారు తిరిగి భోజనం కొనసాగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ సంఘటన జూలై 8, 2021న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ వీడియోకు ఇప్పటికే 50వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది కామెంట్లు కూడా చేస్తున్నారు. అదృష్టం కొద్దీ బతికి బయట పడ్డారు.. అని ఊపిరి పీల్చుకుంటున్నారు.