శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎ03ఎస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్ లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్ లభిస్తోంది. 4జీబీ ర్యామ్ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ను ఉపయోగించుకోవచ్చు.
ఈ ఫోన్లో వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, ఇంకో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈఫోన్ లో లభిస్తుంది. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్స్ లో ఈ ఫోన్ను లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్లను వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంటుంది. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి ఫీచర్లు ఈ ఫోన్లో లభిస్తున్నాయి.
ఈ ఫోన్కు చెందిన 3జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.11,499 ఉండగా, 4జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.12,499గా ఉంది. ఈ ఫోన్ను అన్ని రిటెయిల్ స్టోర్లు, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్, ఆన్లైన్ స్టోర్లలో విక్రయిస్తున్నారు. ఫైనాన్స్ సదుపాయంతో కొంటే రూ.1000 క్యాష్ బ్యాక్ ఇస్తారు.