అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ అనేక పథకాలను ఏపీలో అమలు చేస్తున్నారు. వాటిల్లో నేతన్న నేస్తం పథకం కూడా ఒకటి. దీని ద్వారా చేనేతపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే 81వేల మందికి పైగా రూ.383 కోట్లను అందించారు. దీంతో చేనేత కార్మికుల బతుకులు బాగుపడుతున్నాయి.
వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఎంతో మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు సీఎం జగన్ను తలచుకుంటున్నారు. వైఎస్సార్ లాగే ఆయన తనయుడు కూడా ప్రజల మన్ననలు పొందుతున్నారని చేనేత కార్మికులు అంటున్నారు.
వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఇప్పటికే 2 సార్లు సహాయం అందించారు. ఇక మూడో సారి కూడా సహాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలనే ఒక్కొక్క కార్మికుడికి రూ.24 వేల చొప్పున సహాయం అందించనున్నారు. అలాగే కోవిడ్ వల్ల చేనేత సొసైటీల్లో పేరుకుపోయిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆర్గానిక్ వస్త్రాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి అనేక వినూత్న ప్రయోగాలతో చేనేత రంగానికి మరింత ఊతమిచ్చేలా ఆప్కో ద్వారా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ను పొగుడుతూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.