నిరుద్యోగులకు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన టువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ జోన్ శుభవార్తను తెలిపింది.ఈ క్రమంలోనే ఈ కంటెంట్మెంట్ జోన్ లో ఖాళీగా ఉన్నటువంటి 24 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్,మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్. నర్స్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు.
బీటెక్ లేదా బిఈ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆయా విభాగాలను బట్టి విద్యార్హతలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఆసక్తిగల అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలు దరఖాస్తు ప్రక్రియ అప్పుడే ప్రారంభమైంది.
ఆగస్టు 10వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు ₹500 చెల్లించు కోవాలి. అయితే ఒక్కో విభాగానికి బట్టి వారి నెలవారి వేతనం ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆగస్టు 10 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.