Ankitha : ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి మూవీ గుర్తుంది కదా. ఈ మూవీలో ఎన్టీఆర్ తన మాస్ విశ్వ రూపాన్ని చూపించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఎన్టీఆర్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఇక ఈ మూవీలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. అయితే భూమిక సెకండ్ ఇన్నింగ్స్ తరువాత కూడా సినిమాల్లో నటిస్తోంది. కానీ అంకిత మాత్రం సినిమాలకు దూరమైంది. ఇక ఈమె ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుంది.. అన్న వివరాలను తెలుసుకుందాం.
అంకిత బాలనటిగా కూడా యాక్ట్ చేసింది. అప్పట్లో ఈమె రస్నా యాడ్లో నటించి పాపులర్ అయింది. తరువాత కూడా పలు యాడ్స్లోనూ నటించింది. అయితే హీరోయిన్గా తెలుగులోనే మొదటి చిత్రం చేసింది. అప్పట్లో వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీతో ఈమె సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈమెకు సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు బాగానే వచ్చాయి.

అలా హీరోయిన్ గా మారిన అంకితకు ఎన్టీఆర్ సరసన సింహాద్రిలో నటించే అవకాశం లభించింది. ఈ మూవీ కూడా హిట్ కావడంతో అంకితకు ఆఫర్లు బాగానే వచ్చాయి. తరువాత ఈమె స్టేట్ రౌడీ, విజయేంద్ర వర్మ, సీతారాముడు, అనసూయ, వినాయకుడు అనే మూవీలు చేసింది. అలాగే తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఈమె అందాలను ఆరబోయడంలో అందరికన్నా ఒక మెట్టుపైనే ఉండేది. దీంతో ఈమెను చూసి కుర్రకారు మైమరిచిపోయేవారు.
ఇక తరువాత ఆమె చేసిన అనేక సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమె కెరీర్లో డౌన్ ఫాల్ మొదలైంది. ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు రాకపోయేసరికి ఈమె పూణెకు చెందిన వ్యాపారవేత్త విశాల్ను పెళ్లి చేసుకుంది. అక్కడే సెటిల్ అయిపోయింది. అలాగే తన తండ్రికి ఉన్న వజ్రాల వ్యాపారాన్ని ప్రస్తుతం ఈమె చూసుకుంటోంది. కానీ సినిమాల్లోకి వస్తారా.. అని ఈ మధ్యే ప్రశ్నించగా.. తనకు ఆ ఉద్దేశం లేదని కచ్చితంగా చెప్పేసింది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్లో ఇక ఏమీ ఎంట్రీ ఉండదని స్పష్టమైంది. అయినప్పటికీ వ్యాపారంలో మాత్రం బాగానే రాణిస్తోంది.