నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోందని ఇది వరకు మనకు తెలిసిన విషయమే. అయితే వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుకి ప్రాధాన్యత ఉందట. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ పాత్రలో చేయటం కోసం దర్శకుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బాలయ్య సినిమాలో హీరోయిన్ గా నటించడానికి రకుల్ ప్రీత్ సింగ్ నో చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉండటం చేత డేట్స్ కుదరని కారణంగా బాలకృష్ణ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది. అంతకుముందు దర్శకుడు హీరోయిన్ శృతి హాసన్ ను సంప్రదించగా శృతి కూడా “సలార్” సినిమాతో బిజీగా ఉండటం చేత బాలయ్య సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది.
ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అఖండ” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రమంలోనే దర్శకుడు నటీనటుల ఎంపిక విషయంలో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అఖండ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.