Balakrishna : ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించిన విషయం విదితమే. వాటిల్లో పలువురు ప్రముఖుల పేరిట జిల్లాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పేరిట కూడా జిల్లాను ప్రకటించారు. అయితే ఈ విషయంపై హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఎట్టకేలకు స్పందించారు.
కొత్త జిల్లాల ఏర్పాటును బాలకృష్ణ స్వాగతించారు. అయితే ఎన్టీఆర్ జిల్లాపై ఆయన ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ శ్రీసత్యసాయి జిల్లాకు హెడ్ క్వార్టర్స్గా హిందూపూర్ ఉండాలని అన్నారు. దీని వల్ల హిందూపూర్ ప్రజల సెంటిమెంట్లను గౌరవించినట్లు అవుతుందని అన్నారు.
కాగా ఎన్టీఆర్ జిల్లా ప్రకటనపై ఎన్టీఆర్ ఫ్యామిలీలో కొందరు స్పందించారు. దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి రామకృష్ణలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం దీనిపై కామెంట్ చేయలేదు.