Anasuya Bharadwaj : బుల్లితెర యాంకర్గా రాణిస్తూనే సినిమాల్లోనూ తన సత్తా చాటుతున్న యాంకర్ అనసూయను ఎల్లప్పుడూ వివాదాలు చుట్టుముడుతుంటాయి. ఈ క్రమంలోనే ఆమె ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈమె మరోమారు వివాదంలో చిక్కుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ గేయాన్ని ఆమె కూర్చుని పాడిందంటూ.. నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనసూయ చేసిన పనికి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఈ వివాదంపై స్పష్టతను ఇద్దామనుకుంది. కానీ నెటిజన్లు మాత్రం ఆమెను విమర్శించడం ఆపడం లేదు. అనసూయ జాతీయ గేయాన్ని నిలుచుని పాడకుండా కుర్చీలో కూర్చుని పాడింది. అది ఆమె చేసిన తప్పు. వాస్తవానికి మన జాతీయ గీతం లేదా గేయం ఏదైనా సరే పాడినప్పుడు కచ్చితంగా వాటిని గౌరవిస్తూ లేచి నిలుచోవాల్సిందే. కానీ అనసూయ అలా చేయకుండా కూర్చోవడంపై వివాదం చెలరేగుతోంది.
ఇక గణతంత్ర దినోత్సవం అంటే అంబేద్కర్ బొమ్మ వేసుకోవాలి కానీ టీషర్టుపై గాంధీ బొమ్మ ఏమిటని కూడా కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు. దీంతో స్పందించిన అనసూయ కామెంట్ పెట్టింది.
అరే.. ఏందిరా భాయ్ మీ లొల్లి.. నేషనల్ యాంథెమ్ అంటారు. గాంధీకి, కాన్స్టిట్యూషన్ కి సంబంధమేందంటారు.. మరి జన గణ మణ ఏంది ? ఆగస్టు 15, 1947 అయితేనే 26 జనవరి 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకోనన్నా.. మాట్లాడుర్రి.. హ్యాపీ రిపబ్లిక్ డే మరి.. అంటూ అనసూయ పోస్ట్ పెట్టింది.
View this post on Instagram
అయినప్పటికీ ఆమెపై ట్రోలింగ్ ఆగడం లేదు. ఎల్లప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండే అనసూయకు ఇది తలనొప్పిగా మారింది. మరి ఈ విషయం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.