Lottery : సమాజంలో మనం జీవించడం మాత్రమే కాదు, మన తోటి వారు జీవించేందుకు కూడా సహాయ పడాలి. ఎలాంటి స్వార్థం లేకుండా మనకు కలిగినంతలో పక్క వారికి సహాయం చేయాలి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. ఈ విధంగా చేసేవారు సమాజంలో చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో ఆ బామ్మ ఒకరని చెప్పవచ్చు. తనకు లాటరీ తగిలితే అందులో సగం మొత్తాన్ని టిక్కెట్ అమ్మిన వ్యక్తికి ఇచ్చి ఉదారతను చాటుకుంది. వివరాల్లోకి వెళితే..
అమెరికాకు చెందిన 86 ఏళ్ల మారియన్ ఫారెస్ట్ అనే వృద్ధురాలు ఇటీవల ఓ స్టోర్లో ఓ లాటరీ టిక్కెట్ను కొనుగోల చేసింది. అది తగిలితే మొదటి బహుమతి కింద 5 లక్షల డాలర్లను ఇస్తారు. అయితే ఆమెకు ఆ లాటరీలో 300 డాలర్లు వచ్చాయి. ఆమెకు తగిలిన లాటరీ మొత్తం చిన్నదే అయినప్పటికీ ఆమె అందులో సగం మొత్తాన్ని తనకు టిక్కెట్ అమ్మిన వ్యక్తికి ఇచ్చింది.
ఈ క్రమంలోనే మారియన్ సదరు స్టోర్కు వెళ్లి తనకు వచ్చిన లాటరీలో సగాన్ని ఆ వ్యక్తికి ఇచ్చి అతన్ని ప్రేమగా ఆలింగనం చేసుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఆమె చేసిన పనికి అందరూ ఆమెను అభినందిస్తున్నారు. తగిలిన లాటరీ మొత్తం తక్కువే అయినా.. ఆ బామ్మ అందులో సగం మొత్తాన్ని ఆ టిక్కెట్ అమ్మిన వ్యక్తికి ఇచ్చినందుకు నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.