Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తుంటారు. అయితే ఆమె గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టడం లేదు. దీంతో ఆమెకు ఏమైందోనని అభిమానులు ఖంగారు పడ్డారు. అయితే తాను బాగానే ఉన్నానని చెబుతూ తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టారు.
పవన్ కల్యాణ్, రేణు దేశాయ్లకు అకీరా నందన్, ఆద్యలు ఇద్దరు పిల్లలు కాగా.. ఆద్యతో కలిసి దిగిన ఫొటోను రేణు దేశాయ్ తన సోషల్ ఖాతాల్లో షేర్ చేశారు. తన రియల్ లైఫ్ హీరో ఆద్య తన సెల్ఫీని ఫొటోబాంబింగ్ చేస్తుందని రేణు కామెంట్ పెట్టారు.
ఇక ఈ పోస్టుతోపాటు ఆమె ఓ కామెంట్ను కూడా పెట్టారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, సోషల్ మీడియాకు చిన్న బ్రేక్ ఇచ్చానని, అందుకనే ఇన్ని రోజుల పాటు పోస్టులు పెట్టలేదని తెలియజేశారు. తన గురించి ఖంగారు పడ్డ అభిమానులకు, మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తాను ఇప్పుడు బాగానే ఉన్నట్లు పేర్కొన్నారు.
కాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అతను హైదరాబాద్లోనే విద్యను అభ్యసిస్తున్నాడు.