Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఆయన తనదైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. గేమ్ ఆడిస్తూనే మధ్య మధ్యలో తన పర్సనల్ విషయాలు కూడా తెలియజేస్తూ వస్తున్నారు. ఈ షోకి సామాన్యులతోపాటు పలువురు సెలబ్రిటీలు కూడా గెస్ట్లుగా వస్తున్న విషయం తెలిసిందే.
కర్టెన్ రైజర్ ఎపిసోడ్కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను అతిథిగా తీసుకువచ్చారు. అంతేకాదు ఆయన షోలో ప్రశ్నలకు జవాబులు చెప్పి రూ.25 లక్షలు గెలుచుకుని అదరగొట్టారు. ఈ మొత్తాన్ని ఆయన ఛారిటీకి అందించారు. ఇక కొరటాల శివ, రాజమౌళి, సమంత కూడా ఈ షోలో సందడి చేశారు. మహేష్ బాబు కూడా ఈ షోకి గెస్ట్ గా వచ్చినట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే మహేష్తో ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ పూర్తి చేసినట్టు తెలుస్తుండగా, ఇందుకు సంబంధించి ఓ ఫొటో కూడా లీకైంది. షో ఎప్పుడు టెలికాస్ట్ ఎప్పుడు అవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సీజన్ ను నవంబర్ 18 ఎపిసోడ్ తో ముగించబోతున్నారు. ఆ ఎపిసోడ్ లో మహేష్ బాబు కనిపించబోతున్నారని తెలుస్తోంది.