Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం చాలా మంది సమంతనే తిట్టారు. ఇక కొన్ని యూట్యూబ్ చానల్స్ అయితే సమంత గురించి దారుణంగా వార్తలను ప్రసారం చేశాయి. అయితే మొదట్లో కామ్గానే ఉన్న సమంత.. ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సదరు యూట్యూబ్ చానల్స్కు పరువు నష్టం దావా నోటీసులు పంపించింది. దీంతో ఆ కేసును కోర్టు విచారించనుంది.
సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ వంటి యూట్యూబ్ ఛానెల్స్తో పాటు వెంకట్రావు అనే లాయర్ పై సమంత పరువు నష్టం దావా వేసింది. ఇక ఆమె తరఫున బాలాజీ అనే హైకోర్టు న్యాయవాది వాదిస్తున్నారు.
తన వ్యక్తిత్వాన్ని కించ పరుస్తూ ఆయా యూట్యూబ్ చానల్స్ ప్రసారం చేసిన కథనాలపై చర్యలు తీసుకోవాలని సమంత పిటిషన్లో పేర్కొంది. అయితే ఇలాంటివన్నీ సినిమావాళ్లకు సహజమే అని.. కొంత కాలం అయితే అంతా సద్దుమణుగుతుందని.. అనవసరంగా ఇలాంటి విషయాలను పట్టించుకోవద్దని.. కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలు సమంతకు సూచించారట. అయినప్పటికీ ఆమె వారిపై న్యాయ పోరాటం చేసే దిశగానే ముందుకు సాగుతుండడం విశేషం.