Mogali Rekulu : ఈ మధ్య కాలంలో సినిమా, సీరియల్ పరిశ్రమకు సంబంధించిన పలువురు నటులు వివాదాలలో ఇరుక్కుంటున్నారు. ముఖ్యంగా వేరే మహిళలతో వారు ఎఫైర్స్ పెట్టుకొని వివాదాలలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా మొగలి రేకులులో దయా పాత్రలో నటించిన నటుడు పవిత్రనాథ్ బాగోతాన్ని ఆయన భార్య వివరించింది.
నా భర్తకు అమ్మాయిలంటే పిచ్చి అంటూ పవిత్రనాథ్ భార్య తెలియజేసింది. దయా పాత్రలో నటించి అభిమానుల ఆదరణ చూరగొన్న పవిత్రనాథ్ నిజజీవితంలో పెద్ద విలన్ అని ఆమె వివరించింది. పవిత్రనాథ్ తో తనకు 2009 లో పెళ్లి జరిగిందని.. అప్పటికే అతనికి అమ్మాయిల పిచ్చి ఉందని తెలిపింది. జాతకాల పేరుతో ఎంతో మంది అమ్మాయిలను నేరుగా ఇంటికే తీసుకువచ్చి వారితో గడిపేవాడని తెలిపింది.
తను చేస్తున్న తప్పుల గురించి ప్రశ్నిస్తే అతను నాపై చేయి చేసుకున్నాడని వివరించింది. ఒకమ్మాయితో దాదాపు 8 ఏళ్లు ఎఫైర్ నడిపి మోసం చేశాడు. అతను ఏ సీరియల్ లో చేస్తున్నాడో కూడా నాతో షేర్ చేసుకోడు. తాగొచ్చి టార్చర్ పెట్టేవాడు. మాకు పెళ్లై 10 ఏళ్లు కాగా, అప్పటి నుండి నరకం చూస్తున్నాను. ఈ విషయం అత్తమామలకు చెబితే వారు నన్ను ఇంట్లోంచి గెంటేశారని వాపోయింది. విడాకులు ఇవ్వకుండా నన్ను వేధిస్తున్నాడు, నా భర్తను అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయాలని కోరుతోంది.. పవిత్రనాథ్ భార్య.