Evaru Meelo Koteeshwarulu : జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు (EMK) షోకు గాను ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను తీసుకువచ్చారు. దసరా సందర్భంగా సమంతకు చెందిన స్పెషల్ ఎపిసోడ్ను ప్రసారం చేశారు. అయినప్పటికీ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు రేటింగ్స్ రావడం కష్టంగా మారింది. అయితే ఈ షోకు గాను ఎన్టీఆర్ అన్ని ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తి చేశారు.
ఎవరు మీలో కోటీశ్వరులు షో నవంబర్ మొదటి వారం వరకు ప్రసారం కానుంది. అయితే ఎన్టీఆర్ అన్ని ఎపిసోడ్స్కు చెందిన షూటింగ్ను పూర్తి చేశారు కనుక ఇకపై ఆ ఎపిసోడ్స్ ముగిసే వరకు ప్రసారం చేస్తారు. ఆ తరువాత సీజన్ను ఎప్పుడు ప్రారంభించేది, హోస్ట్గా ఎవరు వచ్చేది.. తరువాత వెల్లడిస్తారు. కానీ తరువాత సీజన్కు కూడా ఎన్టీఆర్నే హోస్ట్గా తీసుకుంటారా ? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది.
ఇక ఈ షోకు రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ కూడా గతంలో గెస్ట్లుగా వచ్చారు. మోహన్ బాబు, తమన్, దేవిశ్రీప్రసాద్ వంటి వారితోనూ పలు ఎపిసోడ్స్ చేశారు. అయితే ఆ ఎపిసోడ్స్ ప్రసారం కావల్సి ఉంది. వాటిని దీపావళి రోజు ప్రసారం చేస్తారని తెలుస్తోంది.
ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఆరంభంలో అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి. కానీ ఆ రేటింగ్స్ తరువాత వారాల్లో నిలబడలేదు. దీంతో పలువురు సెలబ్రిటీలతో ప్రయత్నం చేశారు. అవి కూడా విఫలం అయ్యాయి. ఇక ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయనున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నారు.